TDP Protest.. అనంతపురం: దీక్షా శిబిరం తొలగింపును నిరసిస్తూ టీడీపీ ఆందోళన
ABN , First Publish Date - 2022-09-29T19:28:53+05:30 IST
కళ్యాణదుర్గం పాత మార్కెట్లో దీక్షా శిబిరం తొలగింపును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
అనంతపురం (Anantapuram): కళ్యాణదుర్గం పాత మార్కెట్లో దీక్షా శిబిరం తొలగింపును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు (TDP Leaders) ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు (Uma Maheswara naidu) మాట్లాడుతూ అన్ని అనుమతులు తీసుకున్నా దీక్షా శిబిరాన్ని ఏ విధంగా కూల్చివేస్తారంటూ పోలీసులు, మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పీఎస్ ఎదుట బైఠాయించి.. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.