పురుగులు పట్టిన చిక్కీలపై విచారణ

ABN , First Publish Date - 2022-09-11T05:43:05+05:30 IST

మండలం లోని బండూరు గ్రామం లో పురుగులు పట్టిన చి క్కీలను పంపిణీ చేశారని శనివారం ఆంధ్రజ్యోతిలో ‘పురుగులు పట్టిన చిక్కీలు, చిన్నా రులకు అస్వస్థత’ అనే శీర్షికన కథనం ప్రచురితం అయిన విషయం విదితమే.

పురుగులు పట్టిన చిక్కీలపై విచారణ

 బొమ్మనహాళ్‌, సెప్టెం బరు 10 : మండలం లోని బండూరు గ్రామం లో పురుగులు పట్టిన చి క్కీలను పంపిణీ చేశారని శనివారం ఆంధ్రజ్యోతిలో ‘పురుగులు పట్టిన చిక్కీలు, చిన్నా రులకు అస్వస్థత’ అనే శీర్షికన కథనం ప్రచురితం అయిన విషయం విదితమే. దీంతో కణేకల్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో యల్లమ్మ ఆధ్వర్యంలో సూపర్‌వైజర్లు విచారణ చేపట్టారు. సెప్టెంబరు నెలకు సంబంధించిన చిక్కీలు ఇంకా గర్భిణు లకు, బాలింతలకు పంపిణీ చేయలేదని, ఆగస్టు నెల మొదటి వారంలో పంపిణీ చేసిన వాటిని ఉపయోగించకుండా అంగన్‌వాడీ నిర్వాహకురాలు పద్మావతి నిల్వ వుంచుకుని వారి పిల్లలకు ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. సెప్టెంబరు నెలకు సంబం ధించిన చిక్కీల స్టాకు ఇంతవరకు అంగన్‌వాడీలకు చేరలేదన్నారు. దీంతో అంగన్‌ వాడీ కార్యకర్త వనజాక్షి గురువారం ఎలాంటి చిక్కీలు పంపిణీ చేయలేదని తెలి పారు. గర్భిణులు, బాలింతలు సమయానికి తినకుండా ఇళ్లల్లో నిల్వ వుంచుకుని పిల్లలకు ఇస్తున్నారని అలా చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.


Updated Date - 2022-09-11T05:43:05+05:30 IST