బంజారా ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నిక
ABN , First Publish Date - 2022-01-03T05:37:44+05:30 IST
బంజారా ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం అధికార ప్రతినిధి భూక్యా అనీల్నాయక్ తెలి పారు.
కదిరిఅర్బన్, జనవరి 2: బంజారా ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం అధికార ప్రతినిధి భూక్యా అనీల్నాయక్ తెలి పారు. ఆది వారం స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. గౌరవాధ్యక్షులుగా లక్ష్మేనాయక్, అధ్యక్షు లుగా ఆర్ సుబ్బేనాయక్, జనరల్ సెక్రటరీగా ఎం రవీంద్రనాయక్, ఉపాధ్యక్షులుగా కుళ్ళాయినాయక్, ఎం తిరుపాల్నాయక్, ఆర్ లక్ష్మేనాయక్, జాయింట్ సెక్రటరీలుగా కే శ్రీనివాసనాయక్, ఎం బాలునాయక్, కే దీప్లానాయక్, ట్రెజరర్గా కే రమణానాయక్, లీగల్ అడ్వైజర్గా ఆర్ దశరథ్నాయక్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు గోపాల్నాయక్, క్రి ష్ణానాయక్, తిరుపాల్నాయక్, హెచ్ఎంలు, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.