AP News: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
ABN , First Publish Date - 2022-09-28T16:58:49+05:30 IST
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakarareddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం (Anantapuram): తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakarareddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 యాక్ట్ అమలులో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట అనుమతి లేకుండా బైటాయించి చట్ట విరుద్ధంగా నిరసన తెలిపారంటూ, విధులకు ఆటంకం కలిగించారంటూ ప్రభాకర్ రెడ్డితోపాటు 120 మందిపై కేసు నమోదు చేశారు. టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతల దాడులను నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అనుమతులు లేకుండా ఆందోళనకు దిగి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారంటూ పలు సెక్షన్లకింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. కాగా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ ప్రభకార్ రెడ్డిపై కేసులు నమోదు అవుతున్నాయి.