‘నాసేన కోసం నావంతు’కు భవానీ రవికుమార్‌ విరాళం

ABN , First Publish Date - 2022-09-20T05:22:33+05:30 IST

జనసేన అధినేత పవనకల్యాణ్‌ తలపెట్టిన ‘నాసేన కోసం నావంతు’ కార్యక్రమానికి ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్‌ రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు.

‘నాసేన కోసం నావంతు’కు భవానీ రవికుమార్‌ విరాళం
పవనకళ్యాణ్‌కు రూ.5 లక్షల చెక్కును అందజేస్తున్న భవానీ రవికుమార్‌

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు 19: జనసేన అధినేత పవనకల్యాణ్‌ తలపెట్టిన ‘నాసేన కోసం నావంతు’ కార్యక్రమానికి ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్‌ రూ. 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. సోమవారం విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధినేత పవనకల్యాణ్‌కు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.  భవానీ రవికుమార్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపునకు తనవంతు కృషి చేస్తాననన్నారు. 



Updated Date - 2022-09-20T05:22:33+05:30 IST