కూర్మావతారం నయనానందకరం
ABN , First Publish Date - 2022-09-28T05:39:34+05:30 IST
శరన్నవరాత్రి ఉత్సవాల రెండోరోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ అలంకరణలు చేశారు.
కదిరి, సెప్టెంబరు 27: శరన్నవరాత్రి ఉత్సవాల రెండోరోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ అలంకరణలు చేశారు. కదిరి లక్ష్మీనరసింహ స్వామి శ్రీకూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవిభూదేవి సమేతుడైన స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.