భూ ఆక్రమణలపై త్వరలో చట్ట సవరణ: కొట్టు
ABN , First Publish Date - 2022-05-24T08:20:53+05:30 IST
భూ ఆక్రమణలపై త్వరలో చట్ట సవరణ: కొట్టు
రాష్ట్రంలో దేవదాయ భూముల ఆక్రమణను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఎండోమెంట్ చట్టసవరణకు రానున్న కేబినెట్లో ప్రతిపాదించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రూ.5 లక్షల ఆదాయంలోపు ఉన్న దేవాలయాలకు ఒక లక్షా 58వేల ఎకరాల భూములు ఉన్నాయని, ఆక్రమణల్లో ఉన్న 2 లక్షల ఎకరాల్లో లక్ష ఎకరాలు అర్చకుల యాజమాన్యంలో ఉన్నాయని తెలిపారు. దేవాలయాల్లో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఐజీ స్థాయి అధికారితో ఒక విజిలెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.