AP News: ఏపీ రాజధాని అమరావతి మాత్రమే: నాదెండ్ల మనోహర్‌

ABN , First Publish Date - 2022-09-11T23:13:40+05:30 IST

పీ రాజధాని అమరావతి (Amaravati) మాత్రమేనని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) స్పష్టం చేశారు.

AP News: ఏపీ రాజధాని అమరావతి మాత్రమే: నాదెండ్ల మనోహర్‌

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి (Amaravati) మాత్రమేనని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) స్పష్టం చేశారు. రాజు మారితే రాజధానులు మారతయా? అని ప్రశ్నించారు. రాజు మారినప్పుడల్లా అభివృద్ధి జరగాలి కానీ నష్టం జరగకూడదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతుల తరపున అందరికన్నా.. ముందు ప్రశ్నించి పోరాడిన వ్యక్తి పవన్‌కళ్యాణేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు రైతులకు పవన్ అండగా నిలిచారని తెలిపారు. రైతుల ముందు ప్రభుత్వాలు మెట్టు దిగి ఉండాలే తప్ప రైతులను మెట్లు దించకూడదన్నారు. ఒక రాజధాని కట్టలేరు కాని మూడు రాజధానులు జగన్‌ కడతారా? అని మనోహర్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-09-11T23:13:40+05:30 IST