సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
ABN , First Publish Date - 2021-11-28T05:37:48+05:30 IST
ప్రతి ఒక్కరూ తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి గుంటకండ్ల జగదీ్షరెడ్డి అన్నారు.
సూర్యాపేటటౌన్, నవంబరు 27 : ప్రతి ఒక్కరూ తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి గుంటకండ్ల జగదీ్షరెడ్డి అన్నారు. బ్రాహ్మణసేవాసంఘం, జిల్లా బ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్తీకమాస వన భోజన మహోత్సవ ఆహ్వాన పత్రికను క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీ్షరెడ్డికి సంఘ నాయకులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతుందని అన్నారు. గత పాలకులు తెలంగాణ సంస్కృతిని, యాస, భాషను పూర్తిగా విస్మరించారన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు డాక్టర్ ఆదూర్తి రామయ్య, రమే్షచంద్ర, మంత్రమూర్తి శంకరమూర్తి, జునూతల సుబ్రహ్మణ్యం, యల్లంబట్ల రమేస్, పూర్ణచంద్రరావు, వేణుగోపాలాచార్యులు, శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకుముందు బ్రాహ్మణసేవా సంఘం, జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవ వివరాలను సంఘం నాయకులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.