ఇన్స్పైర్ కాంపిటీషన్లో రాష్ట్రస్థాయికి 14 ప్రదర్శనలు
ABN , First Publish Date - 2021-11-27T03:59:26+05:30 IST
సంగారెడ్డి జిల్లాలో 2020-21లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ న్యూఢిల్లీ, ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ వారి పర్యవేక్షణలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ కం ప్రాజెక్టు కాంపిటీషన్ లో జిల్లా నుంచి పాల్గొన్న 132 ప్రదర్శనల్లో 14 రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని డీఈవో నాంపల్లి రాజేశ్ తెలిపారు.
సంగారెడ్డిఅర్బన్, నవంబరు 26: సంగారెడ్డి జిల్లాలో 2020-21లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ న్యూఢిల్లీ, ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ వారి పర్యవేక్షణలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ కం ప్రాజెక్టు కాంపిటీషన్ లో జిల్లా నుంచి పాల్గొన్న 132 ప్రదర్శనల్లో 14 రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని డీఈవో నాంపల్లి రాజేశ్ తెలిపారు. వాటిలో జీపీఎస్ బెల్ట్, ప్రమాదాలను నివారించడానికి ద్విచక్రవాహనాల కోసం సైడ్ స్టాండ్ తీయనపుడు గేర్ వ్యవస్థను ఆపడం, కరోనా సమయంలో విద్యార్థులకు వేడినీరు, ఫ్లోర్ మాపింగ్ అండ్ బ్రూమింగ్ మిషన్, బోర్వెల్, ట్రాప్రెస్క్యూర్, స్మార్ట్ కార్డ్ ఎనెబుల్ ఇగ్నిషన్ టు పేరెంట్, ఐరన్ బార్స్ మెష్ ఆన్ మ్యాన్హోల్స్, వైఫై సిగ్నల్ బూస్టర్, రిమోట్ ఆపరేటెడ్ అగ్రికల్చర్ సీడింగ్ మెషిన్, క్రాప్స్ ప్రొటెక్షన్ సౌండ్ ఇన్ ఆనిమల్ ఎంట్రీ, ఎగ్ రెసిడ్యు రిమూవింగ్ వైపర్ ఇన్కార్స్, ఆరోగ్యం మరియు పరిశుభ్రత-కరోనా లక్షణాల డిటెక్టర్, డిసర్ట్ వాటర్ వెపర్స్ చేంజ్ ఇన్టు వాటర్, దివ్యాంగుల కోసం బస్సు వంటి ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని ఆయన పేర్కొన్నారు.