విద్యుత్ శాఖ ఎస్ఈగా సత్యనారాయణ
ABN , First Publish Date - 2021-03-21T06:18:38+05:30 IST
విద్యుత్ శాఖ ఎస్ఈగా కేవీజీ సత్యనారాయణ శనివారం బాధ్యతలు తీసుకున్నారు.
విద్యుత్ శాఖ ఎస్ఈగా సత్యనారాయణ
ఒంగోలు (క్రైం), మార్చి 18 : విద్యుత్ శాఖ ఎస్ఈగా కేవీజీ సత్యనారాయణ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. కనిగిరిలో ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఇటీవల ఉద్యోగోన్నతి కల్పించి ఎస్ఈగా నియమించారు. దీంతో ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఈగా పనిచేస్తున్న వీర్ల రవిని విజయవాడ బదిలీ చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణను విద్యుత్శాఖ ఉద్యోగు సంఘాల నాయకులు, పలువురు అధికారులు కలిసి అఽభినందనలు తెలిపారు.