ఆలయాల్లో కొవిడ్ నిబంధనలు
ABN , First Publish Date - 2021-05-05T05:54:50+05:30 IST
నంద్యాలలోని కాళికాంబ చంద్రశేఖరస్వామి దేవస్ధానం, బ్రహ్మనందీశ్వరస్వామి, రమాసహిత సత్యనారాయణ స్వామి, లక్ష్మీవెంకటేశ్వరస్వామి, మల్లికార్జునస్వామి దేవస్థానం, శ్రీకృష్ణ భజనమందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తున్నారు.
- సాయంత్రం దైవ దర్శనం రద్దు
- శుభకార్యాలకు 50 మందికే అనుమతి
నంద్యాల(కల్చరల్), మే 4: నంద్యాలలోని కాళికాంబ చంద్రశేఖరస్వామి దేవస్ధానం, బ్రహ్మనందీశ్వరస్వామి, రమాసహిత సత్యనారాయణ స్వామి, లక్ష్మీవెంకటేశ్వరస్వామి, మల్లికార్జునస్వామి దేవస్థానం, శ్రీకృష్ణ భజనమందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తున్నారు. బుధవారం నుంచి ఈనెల 20వతేదీ వరకు పట్టణంలో కర్ఫూ విధించినందు వల్ల ఉదయం 6గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారని ఈవో వేణునాఽథరెడ్డి తెలిపారు. తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ అనుమతి పొంది 50 మందితో మాత్రమే ఆలయాల్లో ఫంక్షన్లు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అంతకు మించి ఎక్కువ మంది పాల్గొనరాదన్నారు.