నత్తనడకన ఆర్బీకే, సచివాలయ నిర్మాణ పనులు
ABN , First Publish Date - 2021-01-21T05:09:04+05:30 IST
జమ్మలమడుగు మండలంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ కార్యాలయాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
జమ్మలమడుగు రూరల్, జనవరి 20: జమ్మలమడుగు మండలంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ కార్యాలయాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయిదు నెలల నుంచి పనులు అంతంత మాత్రమే చేపట్టి పునాదులకే పరిమితం చేశారు. కొన్ని చోట్ల గోడలు నిర్మించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో ఒక్క చోట మాత్రమే సచివాలయం పూర్తికాగా మిగతా చోట్ల అన్ని గోడలు, బేస్మట్టాలకే పరిమితం అయ్యాయి. పూర్వపుబొమ్మేపల్లెలో మాత్రమే సచివాలయం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మండల పంచాయతీరాజ్ ఇంజనీరు ప్రసాద్ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలకు నిధులు రాకపోవడం, సిమెంటు, ఇసుక సమస్యల కారణంగా పనులు జరుగడంలేదని తెలిపారు.