ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-10T04:26:33+05:30 IST
షాచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం దుంగలను నరికి రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు సానిపాయి రేంజర్ పీరయ్య తెలిపారు.
సుండుపల్లె, డిసెంబరు 9: శేషాచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం దుంగలను నరికి రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు సానిపాయి రేంజర్ పీరయ్య తెలిపారు. వారి వద్ద నుండి ఆరు ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజంపేట డీఎ్ఫవో వెంకటనరసింహారావు ఆదేశాల మేరకు గురువారం ఉదయం 7 గంటలకు పింఛా సెక్షన్ పరిధిలో దిన్నెలబీటు ప్రాంతంలో ఏనుంగుడ్డుకొరవ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా పొదల చాటున కొందరు తమిళ కూలీలు కారులోకి ఎర్రచందనం దుంగలను లోడు చేస్తుండగా ఫారెస్టు అధికారులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారిలో తమిళనాడుకు చెందిన సేలంబరసన్, శివరాజ్ అనే ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.37,711, అలాగే ఏపీ39 ఏపీ9298 నెంబరు గల టయోటా ఇటియోస్ కారును సీజ్ చేశామని తెలిపారు. మరికొందరు పారిపోయినట్లు తెలిపారు. ఈ కూంబింగ్లో ఎఫ్ఎ్సవో రమణ, ఎఫ్బీవోలు సునీర్బాషా, దేవేంద్రారెడ్డి, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.