షటిల్‌ ఆడుతూ సీఐ హఠాన్మరణం

ABN , First Publish Date - 2021-03-24T06:46:17+05:30 IST

గణపవరం, మార్చి 23: పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్‌ (48) మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షటిల్‌ ఆడుతూ కుప్ప కూలిపోయారు. సర్వీస్‌ చేసిన వెంటనే ఆయాసం రావడంతో ఊపిరి తీసుకునే లోపే.. నేలపై పడిపోయారు. అప్పటివ

షటిల్‌ ఆడుతూ సీఐ హఠాన్మరణం
సంఘటన స్థలంలో రోదిస్తున్న బంధువులు, పోలీసులు సిబ్బంది

గుండెపోటుతో కుప్పకూలిన భగవాన్‌ప్రసాద్‌

స్వస్థలం కరప మండలం పెద్దాపురప్పాడు

గణపవరం, మార్చి 23: పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్‌ (48) మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షటిల్‌ ఆడుతూ కుప్ప కూలిపోయారు. సర్వీస్‌ చేసిన వెంటనే ఆయాసం రావడంతో ఊపిరి తీసుకునే లోపే.. నేలపై పడిపోయారు. అప్పటివరకు ఆడుతున్న వారు ఏం జరిగిందో తెలుసుకునేలోగా.. అప్పటికే ఆయన ఊపిరి ఆగిపో యింది. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన భగవాన్‌ ప్రసాద్‌ 2003లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని తపించేవారు. ఈ క్రమంలో 2007లో రిజర్వుడు ఎస్‌ఐగా పదోన్నతి సాధించిన పశ్చిమగోదావరి జిల్లా గణపవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2018లో సీఐగా పదోన్నతి పొం ది కుక్కునూరులో పనిచేశారు. 2019 నుంచి గణపవరంలో సీఐగా ఉన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్‌ చూపించేవారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల కష్టాలను ఎంతో ఓపిగ్గా విని.. వారి సమస్యలను పరిష్కరించేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి కన్నీరుమున్నీరయ్యా రు. ఎస్పీ నారాయణ నాయక్‌, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, డీఎస్పీ దిలీప్‌కిరణ్‌, ఎస్‌ఐలు ఎం.వీరబాబు, నాగరాజు, వీర్రాజు, పోలీస్‌ అధికారుల సంఘం కార్యదర్శి రాయుడు విజయ్‌కుమా ర్‌, కానిస్టేబుళ్లు గణపవరం ఆసుపత్రికి చేరుకున్నారు. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంచి వ్యక్తిగా పేరుం డడంతో ఆసుపత్రి వద్దకు పెద్దఎత్తున జనం చేరుకున్నారు. భౌతి కకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-03-24T06:46:17+05:30 IST