ధరణి ద్వారా 4,511 రిజిస్ట్రేషన్లు పూర్తి
ABN , First Publish Date - 2020-12-16T05:01:15+05:30 IST
జిల్లాలో ధరణి ద్వారా ఇప్పటివరకు 4511 రిజిస్ర్టేషన్లు పూర్తయ్యా యని, రిజిస్ర్టేషన్లు పూర్తి చేయడంలో జిల్లాలోనే నాగిరెడ్డిపేట ప్రథమ స్థానంలో ఉందని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు.
నాగిరెడ్డిపేట, డిసెంబరు 15 : జిల్లాలో ధరణి ద్వారా ఇప్పటివరకు 4511 రిజిస్ర్టేషన్లు పూర్తయ్యా యని, రిజిస్ర్టేషన్లు పూర్తి చేయడంలో జిల్లాలోనే నాగిరెడ్డిపేట ప్రథమ స్థానంలో ఉందని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. మండలం లో ధరణి ద్వారా జరుగుతున్న రిజిస్ర్టేషన్ల అమలు తీరును, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర ణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు చేసు కోవడంలో రైతులకు ఎంతో సులభతరం అయింద న్నారు. జిల్లాలో ధరణి ద్వారా రైతులు రిజిస్ర్టేషన్ల కోసం 4,647 స్లాట్ బుకింగ్ చేసుకోగా, అందులో 4,511 రిజిస్ర్టేషన్లు పూర్తయ్యాయన్నారు. నాగిరె డ్డిపేట తహసీల్ అండ్ సబ్ రిజిస్ర్టేషన్ కార్యాలయంలో ఇప్పటివరకు 290 రిజి స్ర్టేషన్లు పూర్తి చేసి జిల్లాలోనే ముం దుందన్నారు. జిల్లాలోని రిజిస్ర్టేషన్ల ప్ర క్రియ వేగవంతంగా పూర్తి చేస్తున్న స్థా నిక రెవెన్యూ సిబ్బందికి ఆయన అ భినందించారు. జిల్లాలో ప్రస్తుత వానా కాలంలో సీజన్లో లక్షా 3 వేల 273 మంది రైతుల నుంచి 3 లక్షల 74 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొను గోలు చేసినట్లు, కొనుగోలు చేసిన ధా న్యానికి గాను రూ.704 కోట్ల రైతులకు అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.683 కోట్ల ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మి గతా రైతులకు రెండు, మూడు రోజుల్లో రైతుల ఖా తాల్లో వేయనున్నట్లు తెలిపారు. మండలంలోని ధ ర్మారెడ్డి గ్రామానికి చెందిన మహిళా రైతుకు రిజి స్ర్టేషన్ డాక్యుమెంట్ పత్రాలను అందజేశారు. కార్య క్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్, తహ సీల్దార్ సయ్యిద్ అహ్మద్ మస్రూర్ తదితరులు పాల్గొన్నారు.