పరిశుభ్రతకు పెద్దపీట

ABN , First Publish Date - 2020-04-07T09:48:38+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి పట్టణాలు, పల్లెలు యుద్ధం ప్రకటించాయి. ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజ లు స్వీయ

పరిశుభ్రతకు పెద్దపీట

కరోనా కట్టడికి స్థానిక సంస్థల యుద్ధం

ఎప్పటికప్పుడు బ్లీచింగ్‌, హైపోకోర్లైడ్‌ పిచికారీ


యాదాద్రి, ఏప్రిల్‌6(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి పట్టణాలు, పల్లెలు యుద్ధం ప్రకటించాయి. ఓవైపు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజ లు స్వీయ నిర్భంధం ప్రకటించాలని ఆదేశిస్తుండగా మరోవె ౖపు పట్టణాల్లో మునిసిపాలిటీ, పల్లెల్లో పంచాయతీ పాలకవర్గాలు పరిసరాల పరిశుభ్రతకు నడుం బిగించాయి. ప్రధా న రహదారులు, వీధులు, మురికికాల్వలు, నీటి గుంతల్లో రసాయన ద్రావణాలను పిచికారి చేస్తూ క్రిమిసంహారణపై ప్ర త్యేక దృష్టిసారిస్తున్నారు.


హైదరాబాద్‌ నగరానికి శివారుగా విస్తరించిన యాదాద్రిభువనగిరి జిల్లా అధికార యం త్రాంగం కరోనా వైరస్‌ కట్టడికి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రకటించిన లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలుకు పర్యవేక్షిస్తూనే, పరిసరాల పరిశుభ్రతకు స్థానిక సంస్థలను సమాయత్తం చేసింది. దీంతో జిల్లాలోని ఆరు ము నిసిపాలిటీలు, 421 గ్రామ పంచాయతీ ల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మునిసిపాలిటీల్లో ప్రధాన వీధులు,జనసామర్థ్యం గల ప్రాం తాలను హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారిచేస్తున్నారు.

Updated Date - 2020-04-07T09:48:38+05:30 IST