కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-19T06:02:30+05:30 IST
కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దానంపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది.
చేర్యాల, డిసెంబరు 18: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దానంపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. దానంపల్లికి చెందిన లింగాల మహేందర్ (17) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. మనోవేదనకు గురైన మహేందర్ గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాకేశ్ తెలిపారు.