ఇప్పటి వరకు రూ. కోటి 35 లక్షల హవాలా డబ్బు స్వాధీనం: సీపీ

ABN , First Publish Date - 2020-11-21T22:51:06+05:30 IST

ఇప్పటి వరకు రూ. కోటి 35 లక్షల హవాలా డబ్బు స్వాధీనం: సీపీ

ఇప్పటి వరకు రూ. కోటి 35 లక్షల హవాలా డబ్బు స్వాధీనం: సీపీ

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో ఇప్పటి వరకు రూ. కోటి 35 లక్షల హవాలా డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. పట్టుబడిన నగదు ఇన్‌కంట్యాక్స్‌ అధికారులకు అప్పగించామన్నారు. అభ్యర్థులు 2,098 లైసెన్స్ గన్స్ అప్పగించారని చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వదంతుల్ని నమ్మవద్దని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 

Updated Date - 2020-11-21T22:51:06+05:30 IST