వీసాల రెన్యూవల్కు ఆఖరి గడువు అక్టోబర్ 10: దుబాయ్
ABN , First Publish Date - 2020-10-07T15:27:12+05:30 IST
వీసాల రెన్యూవల్పై దుబాయ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. మార్చి 1 నుంచి జూలై 12 మధ్య వీసాల గడువు ముగిసిన దుబాయ్ నివాసితులు తమ వీసాలను రెన్యూవల్ చేసుకోవడానికి అక్టోబర్ 10 ఆఖరు గడువు అని ప్రకటించింది.
దుబాయ్: వీసాల రెన్యూవల్పై దుబాయ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. మార్చి 1 నుంచి జూలై 12 మధ్య వీసాల గడువు ముగిసిన దుబాయ్ నివాసితులు తమ వీసాలను రెన్యూవల్ చేసుకోవడానికి అక్టోబర్ 10 ఆఖరి గడువు అని ప్రకటించింది. లేనిపక్షంలో దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఒకవేళ డెడ్ లైన్ తర్వాత దేశంలో ఉంటే భారీ ఓవర్ స్టే జరిమానా విధిస్తామని పేర్కొంది.
కాగా, వీసాల స్వయంచాలక పొడిగింపులకు సంబంధించి అన్ని తీర్మానాలను రద్దు చేయాలని యూఏఈ క్యాబినెట్ నిర్ణయించడంతో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్(ఐసీఏ) జూలై 12 నుంచి వీసా రెన్యూవల్ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అమెర్ సెంటర్ ఉద్యోగులు, వీసా కన్సల్టెంట్స్... మార్చి 1 నుంచి జూలై 12 మధ్య వీసాల గడువు ముగిసిన నివాసితులకు ఇచ్చిన గ్రేస్ పీరియడ్ అక్టోబర్ 10తో ముగుస్తుంది. డెడ్ లైన్ తర్వాత దేశంలో ఉండే ఓవర్స్టేయర్లకు మొదటి రోజు 125 దిర్హమ్, రెండో రోజు నుండి రోజుకు 25 దిర్హమ్ల జరిమానా ఉంటుందని పేర్కొన్నారు.