5వేల గంటలైనా ఎదురు చూస్తా
ABN , First Publish Date - 2020-10-07T08:02:31+05:30 IST
రాహుల్ సారథ్యంలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని హరియాణా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైడ్రా మా అనంతరం ర్యాలీని తిరిగి అనుమతించారు. సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ నుంచి చేపట్టిన 3 రోజుల ట్రాక్టర్ ర్యాలీ...
- కేంద్రం ఒత్తిళ్లకు లొంగను : రాహుల్
- ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
న్యూఢిల్లీ/పటియాల, అక్టోబరు 6: రాహుల్ సారథ్యంలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని హరియాణా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైడ్రా మా అనంతరం ర్యాలీని తిరిగి అనుమతించారు. సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ నుంచి చేపట్టిన 3 రోజుల ట్రాక్టర్ ర్యాలీ మంగళవారం హరియాణా సరిహద్దుల్లోకి రాగానే.. ఓ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 5వేల గంటలైనా వేచి చూస్తానే తప్ప.. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. అనంతరం గంట సేపటికి హరియాణా సర్కారు ర్యాలీని అనుమతించింది. ఆ తర్వాత పంజాబ్లోని మోగా జిల్లాలో ట్రాక్టర్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలపై పోరాటం రైతులకు, కూలీలకు సంబంధించింది మాత్రమే కాదని, అది ‘భారతీయుల పోరాటం’ రాహుల్గాంధీ అభివర్ణించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యసాయ చట్టాలతో రైతులు, కూలీలు కొందరు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ‘బానిస’లుగా మారిపోతారన్నారు. కాగా, హాథ్ర్సలో దళిత యువతిపై జరిగిన హత్యాచారాన్ని ‘దుర్ఘటన’గా అభివర్ణించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ధైర్యం చాలడం లేదని దుయ్యబట్టారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.