ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-07T05:12:30+05:30 IST

ప్రభుత్వ ఉద్యో గులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతిపత్రం అందించినట్లు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంది వెంకటరమణ తెలి పారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

శృంగవరపుకోట రూరల్‌ (జామి): ప్రభుత్వ ఉద్యో గులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతిపత్రం అందించినట్లు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కంది వెంకటరమణ తెలి పారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ బది లీలు మాన్యూవల్‌ పద్ధతిలో నిర్వహించాలని, వీఆర్‌వోలకు పదోన్నతులు ఇప్పించాలని, ఏఎన్‌ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు.

Updated Date - 2020-12-07T05:12:30+05:30 IST