సత్యసాయి విద్యావిహార్లో జ్ఞానయజ్ఞం
ABN , First Publish Date - 2020-12-20T04:46:25+05:30 IST
స్థానిక రామకృష్ణాపురం సత్యసాయి విద్యా విహార్లో శనివారం సత్యసాయి జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థు లతో శ్లోక పఠనం చేయించారు.
పలాస రూరల్: స్థానిక రామకృష్ణాపురం సత్యసాయి విద్యా విహార్లో శనివారం సత్యసాయి జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థు లతో శ్లోక పఠనం చేయించారు. కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్ మల్లా రామేశ్వ రరావు, ప్రిన్సిపాల్ ప్రీతి చౌదరి, ఉపాధ్యాయుడు సూర్యతేజ పాల్గొన్నారు.
హరిపురం: హరిపురంలో సత్యసాయి 19వ పర్తియాత్ర శనివారం సత్యసాయి విద్యా విహార్ కరస్పాండెంట్ మల్లా రామేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రిన్సిపాల్ ప్రీతి చౌదరి పేద కుటుంబాలకు దుప్పట్లు అందించారు. కార్యక్రమంలో మల్లా శరత్, సూర్యప్రకాష్, జగదీష్ పాల్గొన్నారు.