పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కొనసాగుతున్న కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2020-11-21T14:59:38+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కార్మికుల నిరసన కొనసాగుతోంది. ప్రమాదవశాత్తు కాంక్రీట్ కర్సర్‌లో పడి కార్మికుడు మృతి చెందాడు.

పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కొనసాగుతున్న కార్మికుల నిరసన

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కార్మికుల నిరసన కొనసాగుతోంది. ప్రమాదవశాత్తు కాంక్రీట్ కర్సర్‌లో పడి కార్మికుడు మృతి చెందాడు. కార్మికుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. ప్రమాదానికి గురైన కార్మికుడి విషయంలో నిర్లక్ష్యం వహించారనే ఆగ్రహంతో నిన్న రాత్రి బస్సు పైనా, పలు వాహనాల పైనా కార్మికులు దాడి చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలవరం పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. స్పిల్ వే పనులు చేపట్టేందుకు కార్మికులు ముందుకు రావడం లేదు. 


Updated Date - 2020-11-21T14:59:38+05:30 IST