ముస్లింలకు చంద్రబాబు గుడ్‌న్యూస్

హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష సాయం

నెల్లూరు జిల్లాలో ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మట్లాడారు

ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే మక్కా వెళ్లే ప్రతి ముస్లింకు ఆర్థికసాయం అందిస్తామన్నారు.

ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు.

హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్శిటీని టీడీపీ హయాంలోనే స్థాపించిన విషయాన్ని గుర్తుచేశారు.

గతంలో ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు.

సీఎం జగన్ గత ఐదేళ్లలో ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు