అన్ని సీట్లొస్తే మళ్లీ సీఎంగా కేసీఆర్: కేటీఆర్

మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని.. దానికి 10-12 ఎంపీ సీట్లు వస్తే చాలని మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

కాంగ్రెస్‌ చేతిలో మోసపోయిన ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించాలని కేటీఆర్‌ కోరారు. 

లేకపోతే మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ చేతిలో మోసపోతారని అన్నారు. 

బండి సంజయ్ ఐదేండ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, జై శ్రీ రామ్ నినాదాలతో యువతకి మతపిచ్చి అంటగడుతున్నారని విమర్శించారు. 

రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.