మామిడి పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా?

వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల కాలం వచ్చినట్టే.. తియ్యగా నోరూరించే రుచితో, కమ్మని మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఉంటారా? 

మామిడి పండ్లు భారతదేశం సంస్కృతిలో ఒక భాగం.

మధుమేహం ఉన్నట్లయితే మామిడి పండ్లను తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలనేది ఖచ్చితంగా తెలియని విషయం.

మామిడిలో ఉండే సహజ చక్కెర కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.

ఈ పండు తియ్యగా ఉంటుంది కనుక షుగర్ వ్యాధిగ్రస్తులు వీటిని తినకూడదంటారు. నిజానికి..

మామిడి పండ్లలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. 

ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి సాధారణంగా మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచిది కాదు.

రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవాలనుకుంటే మామిడి పండ్లను మితంగా తీసుకోవాలి. 

బ్లడ్ షుగర్ రీడింగ్‌లు సరిగా లేకపోతే  HbA1c ఎక్కువగా ఉంటే, పండ్లు, కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.