రాత్రుళ్లు సరైన సమయానికి భోజనం చేయడం ఆరోగ్యానికి కీలకం. కానీ కొందరు అనేక కారణాల రీత్యా టైం తప్పి తింటారు.

మధ్యాహ్నం 1 గంటకు తినాల్సిన భోజనాన్ని కొందరు మూడు గంటలకు తింటుంటారు.

మరికొందరు రాత్రుళ్లు 12 గంటలకు భోజనం చేస్తారు.

అత్యంత ముఖ్యమైన రాత్రి భోజనానికి ఓ కరెక్ట్ టైం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నిపుణులు చెప్పే దాని ప్రకారం, రాత్రి 7 నుంచి 8 మధ్య డిన్నర్ పూర్తి చేయాలి

8 తరువాత భోజనం చేయడం మంచి పద్ధతి కాదు

రాత్రి 10 గంటల కల్లా పడుకునే వారు 7 గంటలకే డిన్నర్ పూర్తి చేయడం మంచిది

రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేస్తే ఉదర సమస్యలు వస్తాయి.

ఇక రాత్రి 12 దాటాకా తింటే ఊబకాయం పక్కా, డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.