Share News

9న మరోసారి రాహుల్‌ రాక..

ABN , Publish Date - May 06 , 2024 | 06:11 AM

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరో దఫా రానున్నారు. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు కరీంనగర్‌లో జరిగే జనజాతర సభకు, సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్‌లోని సరూర్‌ నగర్‌లో జరిగే

9న మరోసారి రాహుల్‌ రాక..

10న రాష్ట్రానికి ప్రియాంకా గాంధీ

హైదరాబాద్‌/వికారాబాద్‌/తాండూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరో దఫా రానున్నారు. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు కరీంనగర్‌లో జరిగే జనజాతర సభకు, సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్‌లోని సరూర్‌ నగర్‌లో జరిగే జనజాతర సభకు హాజరు కానున్నారు. అలాగే మరో అగ్ర నేత ప్రియాంకా గాంధీ ప్రచార షెడ్యూలూ ఖరారైంది. ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డిలో, సాయంత్రం 4 గంటలకు తాండూరులో జరిగే జనజాతర సభల్లోనూ, సాయంత్రం 6గంటలకు షాద్‌నగర్‌లో జరిగే రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌ల లో ఆమె పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. తాండూరులో జరిగే సభకు సుమారు లక్ష మందికి సరిపడా సభా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి తెలిపారు. ఇటు వచ్చే ఐదు రోజులూ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి.. బిజీగా గడపనున్నారు. సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నంలో.. సాయంత్రం ఉప్పల్‌లో జరిగే రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన పాల్గొంటారు. అదే రోజున రాత్రి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ప్రచారం చేస్తారు. మంగళవారం ఉదయం నర్సాపూర్‌లో జరిగే జనజాతర సభలో, సాయంత్రం వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగే రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లలోనూ పాల్గొంటారు. అలాగే 8న సాయంత్రం ఆర్మూర్‌ కార్నర్‌ మీటింగ్‌, నిజామాబాద్‌లో జరిగే రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొంటారు. 9, 10 తేదీల్లో రాహుల్‌, ప్రియాంకలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటారు.

Updated Date - May 06 , 2024 | 06:11 AM