Share News

ఆర్‌ఎంపీలు ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేయాలి

ABN , Publish Date - May 18 , 2024 | 10:22 PM

ఆర్‌ఎంపీలు ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత పేర్కొన్నారు. శని వారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలతో సమావేశం నిర్వహించారు.

ఆర్‌ఎంపీలు ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 18: ఆర్‌ఎంపీలు ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత పేర్కొన్నారు. శని వారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు, పీఎంపీలు పేరు పక్కన డాక్టర్‌ అని రాయకూడదని, ఎలాంటి మందులు ఉండరా దని, ప్రిస్కిప్షన్‌పై మందులు రాయరాదని సూచించారు. జాతీయ, స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు జిల్లాలోని ఆర్‌ఎంపీలు, పీఎంపీల క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకొంటామన్నారు. జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2024 | 10:22 PM