Share News

భారత రిలే జట్లకు నిరాశ

ABN , Publish Date - May 06 , 2024 | 05:25 AM

భారత పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే జట్టుకు పారిస్‌ ఒలింపిక్స్‌ రౌండ్‌-1 క్వాలిఫికేషన్స్‌లో నిరాశ ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన హీట్స్‌లో...

భారత రిలే జట్లకు నిరాశ

నసావు (బహామస్‌): భారత పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే జట్టుకు పారిస్‌ ఒలింపిక్స్‌ రౌండ్‌-1 క్వాలిఫికేషన్స్‌లో నిరాశ ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన హీట్స్‌లో రాజేశ్‌ రమేశ్‌కు కాలి కండరాలు పట్టేయడంతో భారత జట్టు రేసు పూర్తి చేయలేక మధ్యలోనే నిష్క్రమించింది. ఇక, తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ, రూపల్‌ చౌదరి, రాజేశ్‌ రమేశ్‌, అవినాశ్‌లతో కూడిన మిక్స్‌డ్‌ 4్ఠ400 మీటర్ల రిలే జట్టు హీట్స్‌లో ఆరో స్థానంలో.. మహిళల 4్ఠ400 మీటర్ల రిలే జట్టు ఐదో స్థానంలో నిలిచి నిరాశపరిచాయి. అయితే, భారత జట్లకు అప్పుడే అవకాశాలు ముగిసిపోలేదు. రౌండ్‌-1లో విఫలమైన అన్ని విభాగాల్లోని జట్లకు సోమవారం జరిగే రౌండ్‌-2 క్వాలిఫికేషన్స్‌లో పోటీపడేందుకు అవకాశం ఉంటుంది. ఈ రౌండ్‌-2 పోటీల్లో రాణిస్తే పారిస్‌ టిక్కెట్‌ దక్కనుంది.

Updated Date - May 06 , 2024 | 05:25 AM