విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి సినీ నటుడు శివాజీ
ABN , Publish Date - May 06 , 2024 | 06:04 AM
నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ చేతులు జోడించి ఓటర్లను అభ్యర్థించారు.
తిరుపతి అర్బన్, మే 5: నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ చేతులు జోడించి ఓటర్లను అభ్యర్థించారు. తిరుపతిలోని తిరుమల బైపా్సరోడ్డులో ఏర్పాటు చేసిన దొన్నె బిర్యానీ హౌస్ను ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్నవారు, ఎన్ని సమస్యలున్నా పోలింగ్ రోజున ఇంట్లో కూర్చోకుండా దయచేసి ఓటు వేయడానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
పిఠాపురంలో జనసేనాని పవన్కల్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. పవన్కల్యాణ్కు ప్రజాసేవ చేయడం మాత్రమే తెలుసునని, సినిమాకు రూ. వంద కోట్ల పారితోషికం తీసుకొనే పవన్ డబ్బులకోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఎవరు దోచుకున్నారో, ఎవరు దాచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు.
బాబు పరిపాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. జగన్ పాలన ఏ విధంగా గడిచిందో చెప్పవలసిన అవసరం లేదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. ఉద్యోగులు డబ్బులు తీసుకొని ఓట్లేయడం మంచిది కాదని శివాజీ అన్నారు.