కేకే లైన్లో జారిపడిన బండరాళ్లు
ABN , Publish Date - May 06 , 2024 | 05:54 AM
కొత్తవలస-కిరండోల్ (కేకే) లైన్లోని బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్పై బండరాళ్లు జారిపడ్డాయి.
రాయిపైకి ఎక్కి నిలిచిపోయిన గూడ్స్ ఇంజన్
అరకులోయ, మే 5: కొత్తవలస-కిరండోల్ (కేకే) లైన్లోని బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్పై బండరాళ్లు జారిపడ్డాయి. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ మార్గంలో వెళ్లిన జంబో గూడ్స్ ఇంజన్ బండరాయిపైకి ఎక్కి ఒక్కసారిగా నిలిచిపోయింది.
బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య 41వ కిలోమీటరు వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బండరాయిపైకి ఎక్కిన ఇంజన్ తొలగింపు, ట్రాక్ పునరుద్ధరణ పనులను ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పూర్తిచేశారు. విరిగిపోయిన ట్రాక్కు సంబంధించిన ఐరన్ కమ్మిని మార్చారు.
ఈ కారణంగా విశాఖపట్నం నుంచి కిరండోల్ వెళ్లాల్సిన పాసింజర్ రైలును విజయనగరం జిల్లా ఎస్.కోటలో దాదాపు ఐదు గంటలపాటు నిలిపివేశారు.